8, డిసెంబర్ 2010, బుధవారం

దేశాన్ని కాపాడే రంగం ఏది

చట్ట సభలు.. కార్య నిర్వాహక వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ.. పత్రికా రంగం.. ఈ నాలుగు భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలు..
చట్ట సభలు.. కార్య నిర్వాహక వ్యవస్థలపై ఎప్పుడో నమ్మకం పోయాయి..
16 మంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులలో 8 మంది.. అవినీతిపరులేనని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ చేసిన ఆరోపణలు.. భూ కుంభకోణంలో చిక్కుకుని బదిలీ అయిన కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దినకరన్ నిర్వాకంతో న్యాయ వ్యవస్థ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది..
2జీ స్పెక్ట్రం కుంభకోణంలో లాబీయిస్టు నీరా రాడియాతో ప్రముఖ జర్నలిస్టులు జరిపిన సంభాషణల టేపులు బయటపడడంతో.. పత్రికా వ్యవస్థపై కూడా నమ్మకం, విశ్వాసం పోయింది..
వ్యవస్థలన్నీ కుళ్లి కృశించుకు పోతుంటే ఇక దేశాన్ని కాపాడే రంగం ఏది?