30, అక్టోబర్ 2013, బుధవారం

నాన్నమ్మ , నాన్న.. ఒక బుల్లబ్బాయి కథ

భారత దేశం తత్వవేత్తలకీ, దార్శనికులకీ, జ్యోతిష పండితులకీ పేరుగాంచిన సంపన్న దేశం అని విన్నాను కానీ రాజకీయ నాయకులు దెశ భవిష్యత్తు గురించి కాక వారి ఆయుష్ గురించీ, మరణ విధానానం గురిచి  కూడా ముందే చూసి చెప్ప గలరని శ్రీ శ్రీ రా.గాం గారిని చూసి తెలుసుకున్నాను !


6, అక్టోబర్ 2012, శనివారం

అదే కాంచనమాల రికార్డ్!

అదే కాంచనమాల రికార్డ్!

కాంచనమాల
మనోహరమైన రూపం ... మధురమైన స్వరం ... మరిచిపోలేని అభినయం ... ఈ మూడూ కలగలిసిన కమనీయ సౌందర్యమే కాంచనమాల.తెనాలిలో జన్మించిన కాంచనమాల 1935 లో 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రంలో శ్రీ కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరైన మిత్రవిందగా నటించింది. ఈ సినిమాతో తన ఉనికిని చాటుకున్న కాంచనమాల, ఆ మరుసటి ఏడాది 'వీరాభిమన్యు' చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది.ఈ సినిమాలో ఆమె సుందర సుకుమారమైన రూపం ... సుమధురమైన స్వరం ... నవరసాలను అమాంతంగా కురిపించగల విశాలమైన కళ్ళు చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్దులై పోయారు.

ఇక 1937 లో వచ్చిన 'విప్రనారాయణ' చిత్రంలో దేవదేవిగా ఆమె ప్రదర్శించిన సహజ సౌదర్యం ..., 'గృహలక్ష్మి' చిత్రంలో వేశ్యగా ఆమె ఆవిష్కరించిన హావభావాలు కాంచనమాల స్థానాన్ని సుస్థిరం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన 'మాలపిల్ల' చిత్రం కాంచనమాల ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. వాడవాడలా ఆమె పేరు మారుమోగి పోయింది ... ఆమె పేరుతో చీరలు - రవికెలు విక్రయించేంతటి పాప్యులారిటీని ఆమె సొంతం చేసుకుంది. వడ్ల బస్తా 3 రూపాయలు అమ్మే ఆ రోజుల్లో ఆమె ఒక్కో సినిమాకి 10 వేల రూపాయల పారితోషికాన్ని తీసుకుంది. దానిని కాంచనమాల సాధించిన రికార్డుగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

ఆ తరువాత కాంచనమాల ఒకటి రెండు సినిమాలు చేసినా జెమినీ వారి 'బాలనాగమ్మ' సినిమా ఆమెను కథానాయికగా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. అయితే ఈ సినిమానే ఆమెను కోలుకొని దెబ్బ తీసింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో కుటిలమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న వాసన్ తో ఆమె గొడవ పడింది. ఆ వివాదం న్యాయస్థానం వరకూ వెళ్లడంతో కాంచనమాల మతి స్థిమితాన్ని కోల్పోయింది ... ఆమె భ్యవిష్యత్తు అలా మసకబారి పోయింది.

ఘనమైన మనసున్న ఘంటసాల



ఘంటసాల
ఘంటసాల ... తెలుగు పాటతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి ఈ పేరంటే ప్రాణం. మధురమైన స్వరం పై మక్కువ చూపేవారికి ఆయనంటే అంతులేని అభిమానం ... అమితమైన ఆరాధన. మధురమైన స్వరంతోనే కాదు ... మంచులాంటి మనసుతో కూడా ఆయన ఎందరినో ఆకట్టుకున్నారు. అందుకు నిదర్శనంగా అప్పట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ కథానాయకుడుగా చేసిన 'భలే తమ్ముడు' చిత్రానికి గాను పాటల రికార్డింగ్ జరుగుతోన్న రోజులవి. ఈ సినిమా నిర్మాత అయిన పుండరీ కాక్షయ్య కొత్తదనం కోసం పాటలను మహమ్మద్ రఫీ తో పాడించాలనుకుని, బొంబాయి నుంచి ఆయనని పిలిపించారు.

మద్రాసులో అడుగు పెడుతూనే ఆయన ఘంటసాలను కలిసి, ఆయన వంటి మహాగాయకుడు ఉండగా తెలుగులో తాను పాడకూడదని అన్నాడట. అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దనీ ... తనకి ఇచ్చేదానికన్నా ఎక్కువే ఇస్తారు కాబట్టి లాభం పొందమంటూ ఘంటసాల ప్రోత్సాహించారు. ఘంటసాల ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడంతో, ఆయన పెద్ద మనసుకి రఫీ ఆశ్చర్య పోయారట.

ఆ తరువాత 'సువర్ణ సుందరి' సినిమాను హిందీలో తీస్తుండగా, ''హాయి హాయిగా ఆమని సాగే'' అనే పాటను హిందీలో పాడటానికి లతా మంగేష్కర్ - రఫీ మద్రాసుకి వచ్చారు. అయితే ఈ పాట రిహార్సల్ జరుగుతుండగా వరుస కుదరక రఫీ ఇబ్బంది పడిపోతున్నాడు. అదే సమయంలో వేరే సినిమా పాటల రికార్డింగ్ కోసమని అక్కడికి వెళ్లిన ఘంటసాలను లతా మంగేష్కర్ చూసి, తనతో కలిసి ఆ పాటను పాడమని ఒత్తిడి చేశారు. అలా చేస్తే రఫీని కించపరిచినట్టు ఔతుందని భావించిన ఘంటసాల, ఆమెకి ఏదో కుంటి సాకు చెప్పి అక్కడి నుంచి బయట పడ్డారట.         

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అయితే అప్పుడు వీళ్ళు వ్రాసినవన్నీ అబద్దాలేనా??


అయితే అప్పుడు వీళ్ళు వ్రాసినవన్నీ అబద్దాలేనా??                               

అన్నయ్య చిరంజీవి తెగ భాదపడిపోయాడు…తమ పార్టీని కాంగ్రెస్స్ లో కలిపేస్తున్నట్టు బోగస్ వార్తలు సృష్టించి తమను కించపరుస్తునారనీ…

ఆ పత్రికల వాళ్ళను నానా విధాలుగా ఆయనా మిగిలిన అందరూ ఆడిపోసుకున్నారు…మరి ఇప్పుడు గోచీ బిగించుకుని కాంగ్రెస్స్ జండా కప్పుకుని ఎలా తిరిగేస్తున్నాడో…..[కపట నాటక సూత్రధారి..(అన్న గారి డైలాగ్)]
అప్పటి వార్తను ప్రచురించిన వాళ్ళను దోషులుగా చూపించి ఎలా ఆడిపోసుకున్నారో క్రింది వీడియో చూడండి…..
అందుకే నిజాలు బహిర్గతమయ్యే వరకూ ఓపికపట్టలి గాని…ఆ చాన్నళ్ళను నిందించడం…..తగదు…[మా జగనన్న మీడియా కు మాత్రం...మినహోయింపు ఇవ్వవచ్చునేమో]

17, నవంబర్ 2011, గురువారం

తొలి కలల ప్రేమలేఖ



ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి? 'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథి వంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన. 'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి. పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచరణీయం.

మతి పోయిందా పరకాలా సార్?



ప్రపంచం మారుతోంది…జనాలు చదువులు నేర్చుకుంటున్నారు..ఐటీలనీ కంప్యూటర్లనీ సెల్ ఫోన్లనీ అనేక రకాల ఉద్యోగ అవకాశాలతో..
సామాన్య జనం ఓ స్థాయికి చేరుకుంటున్న సమయంలో…
రాజకీయ నిరుద్యోగి రెచ్చగొట్టుడు తో మేమెక్కడ వెనకపడిపోతామో అని మిగతా పార్టీల సన్నాసి నాయకులందరూ.. వెధవలందరూ… జనానికి ఎంతో కష్టపడి తెలంగాణా విషాన్ని సక్సస్ ఫుల్ల్ గా ఎక్కించాక…
ఈ పరకాల ప్రభాకర్ ఎవరండీ…జనాల్లో తెలంగాణా సెంటిమెంట్ లేదంటాడు?
ఈ రాజకీయనాయకులందరూ జనాల మెదళ్ళను విషపూరితం చేశారని ఈ పెద్ద మనిషికి తెలియదా??
ఈ రాజకీయులందరి బ్రతుకు తెరువు ఇప్పుడు జై తెలంగాణా అనక తప్పదని తెలీదా??టీవీ ల ముందు రంకెలేస్తున్న తెలంగాణా నాయకులకు ఇప్పుడు వెనక్కు వెళ్ళే దిక్కు లేక అరుస్తునారన్న విషయం ఈ పరకాలకు తెలియదా??
ఈ డిమాండ్లేవీ తెలంగాణా ప్రజలను ఉద్దరించడానికి కాదని…వాళ్ళ ఉనికి కోసమేననీ ఈ ఈ పరకాలకు తెలియదా??
వీళ్ళు కలుగ చేసిన భ్రమలకు వందలాది జనాలు ఆత్మహత్యలు చేసుకుంటే…ఆ నంబరు చూపించి ఈ నాయకులు ప్రతీ సారీ టీవీ ల ముందు జనాన్ని మరింత రెచ్చగొడుతున్నారని తెలియదా??మరి ఈ నాయకుల పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోరో??వెర్రి భాగుల జనమే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారో పరకాలకు…తెలియదా??
ఉదయం లేస్తే తమ బ్రతుకు తెరువు కోసం జనం రోడ్డు మీదకు వస్తారుగానీ…ఉద్యమాలకోసం కాదని పరకాల వేరే చెప్పాలా??
ఉద్యమాలకోసం…ఆ పేరుతో వచ్చేది మన సన్నాసి రాజకీయనాయకులే కదా??ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొడితే…ఓట్లూ..పదవులూ…ఓహో…ఆ భోగమే వేరుకదా…కేసీఆర్ కుటుంబాన్ని చూడండీ….ఉద్యమమ్ పేరుతో ఎంత తమాషా నడిపిస్తాడో?ఈ తతంగమంతా తెలీకనా మన ప్రభాకరుడు…అదేదో గొప్ప ఉద్యమమ్గా గుర్తించి సవాలు చేయడం??

11, అక్టోబర్ 2011, మంగళవారం

అమెరికా సైనికుల శాడిజం ఇలా ఉంటుంది


౧)అమెరికా సైనికులు పిల్లలకి నీళ్ళ సీసా ఇస్తామని ఆశ చూపి లారీ వెనకాల పరిగెత్తిస్తున్న దృశ్యం
౨)అమెరికా సైనికుల ఇరాకీ పిల్లల చేత ఇరాక్‌కి వ్యతిరేకంగా అశ్లీల గీతం పాడిస్తున్న దృశ్యం. ఫక్ ఐరాక్ అంటే ఏమిటో ఆ ఇరాకీ పిల్లలకి తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఇరాకీ పిల్లల చేత అశ్లీల గీతం పాడించారు.

రెండు చపాతీల కోసం అశుద్ధాన్ని చేతితో ముట్టుకునే దుస్థితిలో గుజరాతీ పాకీ పనివాళ్ళు

గుజరాత్ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందనీ, గుజరాత్‌లో అవినీతి లేదనీ గుజరాత్ పాలనని వీరోచితంగా పొగిడేస్తున్నారు కొందరు కార్పొరేట్ మీడియావాళ్ళు. గుజరాత్‌లోని దామాపూర్ గ్రామంలో ఐదు వాల్మీకీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి చెందిన ఎనిమిది మంది మహిళలు లెట్రిన్‌లు కడిగే వృత్తిలోనే ఉన్నారు. వాళ్ళు నూటపదిహేను కుటుంబాలకి చెందిన లెట్రిన్‌లు కడుగుతారు. ఆ కుటుంబాలు ముస్లింలు, ఠాకూర్‌లు & బ్రాహ్మణులకి చెందినవి. ఈ నూటపదిహేను కుటుంబాలకి చెందినవాళ్ళకి తమ లెట్రిన్‌లు తాము శుభ్రం చేసుకోవడానికే అసహ్యం కలిగినప్పుడు వీళ్ళ లెట్రిన్‌లని శుభ్రం చెయ్యడానికి ఇతరులకి ఎంత అసహ్యం కలగాలి? ఈ లింక్ చదవండి:http://www.countercurrents.org/rawat210311.htm ఎవరి అశుద్ధాన్ని వాళ్ళే కడుక్కోవాలని తెలియనివాళ్ళు నాగరిక సమాజంగా చెప్పుకునే సమాజంలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదా? తెల్ల చొక్కా వేసుకున్న డబ్బున్నవాడు రోడ్డు పక్కన పేడ చూస్తేనే అసహ్యపడిపోతాడు. అటువంటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి ఉపయోగించిన లెట్రిన్‌లో చెయ్యి పెట్టాలంటే ఇంకెంత అసహ్యం కలగాలి? పాకీవాళ్ళూ మనుషులే కానీ బతకడానికి వేరే దారి లేక రెండు చపాతీల కోసం అశుద్ధాన్ని ముట్టే స్థితిలో ఉన్నారు. ఇంకో విచిత్రమేమిటంటే తమది స్వేచ్ఛాసహోదరత్వవాద మతం అని చెప్పుకునే ముస్లింలు పాకీ వృత్తిని సమర్థించడం! ఇంత అనారోగ్యకరమైన వాతావరణంలో స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది, సహోదరత్వం అనే పదానికి అర్థం ఎక్కడ ఉంటుంది?

2, ఆగస్టు 2011, మంగళవారం

సినిమానే సర్వస్వమా?


ఆలోచించగా, ఈమధ్య కాలంలో అంతా సినిమామయంగానే కనబడ్తోంది నాకు. ఏ టీవీ ఛానెల్ను తీసుకున్నా
నూటికి తొంభైశాతం సినిమా బేస్డ్ ప్రోగ్రాములే. ప్రాయోజిత కార్యక్రమాలు (sponsored programs)తీసుకోండి. నూటికి నూరుశాతం సినిమాలపై ఆధారపడినవే. రియాలిటీ షోలు అనబడే emotional humbug కార్యక్రమాల్లో కూడా తొంభైశాతం సినిమా బేస్డ్. వ్యక్తిగతమైన ప్రతిభ యొక్క వికాసానికి ఇవి ఏమాత్రం దోహదం చేస్తాయన్నది ఓ పెద్ద అనుమానమే!


ఇవి కాక సినీ అవార్డుల ఫంక్షన్ల లైవ్ ప్రసారాలు వస్తున్నాయి. ఆపైన రిటైర్మెంట్ దగ్గర పడ్తోన్న హీరోలు తమ కుమారుల్ని తారాపధంలోకి ప్రవేశపెట్టేందుకు నిర్వహించే "లాంచింగ్ ప్రోగ్రాములు" అడపదడపా వస్తూనే ఉంటాయి. ఇంటర్వ్యూలు, స్పెషల్ కవరేజులు, ప్రమోషనల్ యాడ్స్ వగైరా వగైరాలు కూడా వస్తుంటాయి. వెరసి "సర్వం శివమయం" అన్నట్టుగా వినోదమంటే సినిమాయే అన్నట్టు ప్రచారం జరిగిపోతోంది.

ఈ సినిమా మాయ పండుగల్ని కూడా వదలదు. భక్తితో ఆచరించుకోవాల్సిన పండుగపూట ఇంటిల్లిపాదీ హింసానందంలో మునిగిపోవాల్సిందే. "ఒక్కడు" లేక "ఆ నలుగురు"తో సర్దుకుపోవాల్సిందే.

ఇంతకీ ఈ సినిమా మానియా మనకు ఇస్తున్నటువంటి అదనపు మౌల్యాధారిత ప్రయోజనం (value-added usage) ఏమైనా ఉందా అని చూస్తే నా వరకూ సున్నా అనే అనిపిస్తుంది. 

సినిమా అంటే కొన్ని వందలమంది కష్టఫలితమే. ఇందులో అనుమానం లేదు. కానీ అంత డబ్బు ఖర్చుపెట్టి, అంతమంది శ్రమదానంతో సాధిస్తున్నదేమిటి? నా పరిధిలో చూస్తే చిల్లర వినోదం, జుగుప్సాకరమైన బూతు విన్యాసాలు, మితిమీరిన హింస, నిరుపయోగమైన సెంటిమెంట్ల జోరు తప్ప వ్యక్తిగత వికాసానికి తోడుపడే ఒక్క అంశం కూడా ఇప్పటి సినిమాల్లో కనబడడంలేదు.
**********
Slumdog Millionaire సినిమా చర్చల దుమారాన్ని రేపింది. ఈమధ్య కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఇలాంటి చర్చలను లేవదీయలేదు. అద్భుతమైన గ్రాస్ కలెక్షన్స్ తో ఆడుతున్నట్టుగానో, మంచి ఓపెనింగ్ టాక్ వచ్చినట్టుగానో పత్రికల్లో రాసుకోవడమే తప్ప తెలుగు సినిమాలు మెదడుకు మేత వేసిన సందర్భాలు చాలా తక్కువ. 

నా వరకూ, గూడవల్లి రామబ్రహ్మం గారి "మాలపిల్ల", అక్కినేని నాగేశ్వర రావు నిర్మాతగా వచ్చిన "సుడిగుండాలు", సి.హెచ్.ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన "అంకురం" మెయిన్ స్ట్రీమ్ లో వచ్చిన మంచి చిత్రాలు. ఇవి నిజంగా మన మెదడుకు పని కల్పించే చిత్రాలే. ఈమధ్యలో సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ అవేవీ కమర్షియల్ చట్రంనుంచి బైటపడలేదు.

రౌడీయిజం గురించి చూపించే సినిమాలు కూడ సమకాలీన సమస్యల్నే ప్రతిబింబిస్తాయి. కానీ రౌడీయిజంను గ్లోరిఫై చేయడం ద్వారా సమస్యల్ని పెంచుతున్నాయి. అలాగే టీనేజ్ ప్రేమచిత్రాలు కూడా. విజయవాడలో ఓ అమ్మాయిని కిరాతకంగా హత్య చేసిన యువకుడు ఆ అమ్మాయి దేహం పై "చిరుత" అని రాయడం ఒక ఉదాహరణ. నిత్యకృత్యమైపోయిన యాసిడ్ దాడుల్లో ముప్పాతిక భాగం సినిమా ప్రేరితాలే కదా!

ఐతే సినిమాల వల్ల (ముఖ్యంగా గేయ సాహిత్యం వల్ల) సమాజంలో కొన్ని మంచి మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓ ఇంటర్నెట్ డిస్కషన్ ఫోరమ్ లో చదివాను ఘంటసాల పాడిన "కల కానిది విలువైనది" అలాగే కిషోర్ కుమార్ పాడిన "సంఝౌతా గమోంసే కర్ లో" పాటలు అప్పటి యువతరంలో ఆత్మహత్యా ధోరణిని తగ్గించగలిగాయట. అలానే 1970ల్లో వచ్చిన "కోరికలే గుర్రాలైతే", "మరో చరిత్రలు" కూడా కొద్దిపాటి మంచి ప్రభావాన్ని చూపగలిగాయి. విశ్వనాథ్ తీసిన "శంకరాభరణం", "సాగరసంగమం" సంగీత, నృత్యాల పట్ల ప్రజల్లో అభిరుచిని పెంచగలిగాయి. కానీ ఈ ప్రభావాల పరిధి చాలా తక్కువ.
**********
సమాజంపై నిజమైన ప్రభావం చూపగలిగిన సినిమాలు తెలుగులో చాలా తక్కువ. ప్రేక్షకులు కోరినదని, ట్రెండ్ సెట్టింగ్ , కీర్తి కండూతి , డబ్బులు సంపాదన వంటి విషవలయాలలోనే మన సినిమాలు తిరుగుతున్నాయి.

బాపు, విశ్వనాథ్, బాలచందర్ వంటి సీరియస్ దర్శకుల ఒరవడిని కొనసాగించేవాళ్ళు కనుచూపు మేరలో ఎవరూ కనబడడంలేదనేది నావంటి వారి ఆవేదన.

నాయక, నాయికల భాష మారిపోయింది. వేషభూషలూ మారిపోయాయి. ఎంత రోతగా ఉంటే అంత అప్ టు డేట్ అన్న ఫీలింగ్ పెరిగిపోయింది. మర్యాదలు మాయమైపోయాయి. ఒరే, ఒసే అని పిలుచుకునే విధానం అమలులోకి వచ్చేసింది. ప్రేమ కోసమై తల్లిదండ్రుల్ని మోసం చేయడమన్నది, అబద్ధాలు ఆడడమన్నది హీరోయిజమైపోయింది. ఆ అబద్ధాల్ని నిలుపుకోవడానికి ఎంతటి అఘాయిత్యానికైనా తెగబడడమన్నది రొటీన్ ఐపోయింది.


ఇప్పటి వెకిలి పాటలకు (మరీ ముఖ్యంగా డ్యూయెట్లకు)అనుగుణంగా టీవీల్లో వచ్చే పిల్లల డాన్స్ ప్రోగ్రాముల్లో చిన్న చిన్న పిల్లలు ఆ కవాతులు చేస్తుంటే చప్పట్లు కొట్టే వాళ్ళని, ముఖ్యంగా పిల్లల్ని అక్కడిదాకా లాక్కువచ్చిన తల్లిదండ్రుల్నీ ఛీకొట్టాలనిపిస్తుంది.

ఇదేనా మనం మన భావితరాలకు చేస్తున్న వాల్యూ అడిషన్? ఈరోజు టీవీలో గెంతులేసిన పిల్లలే యాసిడ్ పోయరని, ప్రేమ పేరుతో జీవితాల్నే అంతం చేసుకోరని గ్యారంటీ ఆ తల్లిదండ్రుల్లో ఉందనే అనుకోవాలా? సినిమాల్లోని హీరో హీరోయిన్లకు మల్లేనే వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసగించడమే మన ఆశయమా?

స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి సినిమాలు భారతీయుల్ని వెకిలిగా చూపించాయి అన్నది వ్యర్ధమైన వాదన అనే అనిపిస్తోంది. మన హీరో హీరోయిన్లు చేస్తున్న వెకిలి చేష్టలే "కళ"గా ప్రచారం పొంది డబ్బులు రాలుస్తున్నపుడు మన దేశంలోని దరిద్ర్యం కూడా కళనే. కళాకారులకు ఎల్లల్లేవు కదా! అందువల్ల హాలీవుడ్ వాళ్ళు కూడ మన దారిద్ర్యాన్ని "కళ"గా చూపించి సొమ్ము చేసుకోవచ్చు. వాటికి అవార్డులు రావడమన్నది ఒక అదనపు మెరుపు మాత్రమే.

వాదాల్ని లేవదీసే ఉద్దేశ్యంతో కాక ఒక నా అభిప్రాయాల్ని వినిపించేందుకే ఈ ఆర్టికల్ ను రాసాను.

28, జూన్ 2011, మంగళవారం

సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా బలమైన జాతిని నిర్మించిన స్టాలిన్

రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చినప్పుడు  తొలినాళ్లలో విప్లవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ చక్రవర్తుల అనుకూల వర్గంవాళ్లు తిరిగుబాటు చేశారు. ఆ సమయంలో ప్రతిరోధక శక్తులకి సామ్రాజ్యవాద దేశాలు మద్దతు ఇచ్చాయి.  బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రతిరోధక శక్తులకి మద్దతుగా తమ సైన్యాలని పంపాయి. అది వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా బాగా నష్టపోయిన సామ్రాజ్యవాదులకి కొత్తగా రష్యాపై దాడి చెయ్యడం  పెద్ద ఖర్చు వ్యవహారమనిపించింది. దాంతో సామ్రాజ్యవాదులు రష్యా నుంచి తమ సైన్యాలని ఉపసంహరించుకున్నారు. సామ్రాజ్యవాదులు రష్యాపై ఎప్పటికైనా తిరిగి దాడి చేస్తారని స్టాలిన్ ముందే ఊహించాడు. సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా దేశాన్ని సంసిద్ధం చెయ్యాలంటే దేశాన్ని ఆర్థికంగా బలపరచాలి. దేశాన్ని ఆర్థికంగా బలపరచాలంటే దేశాన్ని పారిశ్రామీకరించాలి, వ్యవసాయాన్ని కూడా సమిష్టీకరించాలి. వ్యవసాయాన్ని సమిష్టీకరించడానికి అక్కడి మధ్య తరగతి రైతులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం ఆ రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుని వాటిని సమిష్టీకరించాల్సి వచ్చింది. తిరుగుబాటు చేసిన రైతుల్ని అరెస్ట్ చేయ్యడం లేదా పార్టీ కార్యకర్తల సహాయంతో బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. 1927 తరువాత రష్యాలో వేగంగా పారిశ్రామీకరణ, వ్యవసాయ సమిష్టీకరణ జరిగాయి. 1933లో రష్యాలోని పారిశ్రామీకరణ చూసి సామ్రాజ్యవాద దేశాలన్నీ భయపడ్డాయి. అదే సమయంలో జెర్మనీలో తీవ్రమైన anti-communist inclinations కలిగిన నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. రష్యాపై దాడి చేసే పని నాజీ సామ్రాజ్యవాదులు చూసుకుంటారని ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుకున్నాయి. నిజానికి నాజీ నియంత హిట్లర్ కంటే తీవ్రమైన anti-communist inclinations ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాద నాయకుడు విన్స్టన్ చర్చిల్. అతను విప్లవ ప్రభుత్వాలని పురిట్లోనే చంపెయ్యాలని వాదించేవాడు. హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రభావంతో సామ్రాజ్యవాదిగా ఎదిగాడు కానీ తన ఎదుగుదలని ప్రభావితం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యం పైనే దాడి చెయ్యాలనుకున్నాడు. చివరికి హిట్లర్‌ని ఓడించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు స్టాలిన్‌తో చేతులు కలపాసి వచ్చింది. 1940 నాటికి రష్యాలో విప్లవ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించింది. నిరుద్యోగాన్ని పూర్తిగా మాయం చేసింది. 1933 సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 20 నుంచి 30 శాతం నిరుద్యోగం ఉండేది. తమ దేశంలో విప్లవం రాకుండా ఉండేందుకు USA పాలక వర్గం కూడా నిరుద్యోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. నాజీ సైన్యాలు USAపై కూడా దాడి చెయ్యడంతో USA కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి దిగి నాజీ కూటమిలో భాగమైన జపాన్‌పై దాడి చేశాయి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. రష్యా గెలిచింది కానీ నాజీ బాంబు దాడులకి రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయింది. నాజీలు ఫాక్టరీలతో పాటు వ్యవసాయ క్షేత్రాలపై కూడా బాంబులు వేశారు. 1940లో ప్రపంచంలోని 40% వ్యవసాయ ఎగుమతులు రష్యా నుంచే జరిగేవి. వ్యవసాయ క్షేత్రాలు బాంబు దాడుదలలో ద్వంసం కావడంతో వ్యవసాయ ఎగుమతులు భారీగా క్షీణించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత టైమ్‌లో సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లలో 80% మంది ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు. అప్పటికీ USAలో పట్టణీకరణ 64% దాటలేదు.  సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లు USA కంటే వేగంగా పట్టణీకరణ చెందాయి కానీ దక్షిణ రిపబ్లిక్‌లు వ్యవసాయంపై భారీగా ఆధారపడ్డాయి. తజికిస్తాన్ రిపబ్లిక్‌లో పట్టణీకరణ కేవలం 33% ఉండేది. తుర్క్‌మెనిస్తాన్ రిపబ్లిక్‌లో ఎడారి భూములు ఎక్కువగా ఉండడంతో అక్కడ భారీ పరిశ్రమలు పెట్టలేకపోయారు. స్టాలిన్ రష్యాని పారిశ్రామీకరించినప్పటికీ ప్రాంతీయ అసమానతలని నిర్మూలించలేకపోయాడు. ఒకప్పుడు కజక్‌స్తాన్ ప్రాంతంలో పశువులని పోషించుకుంటూ, జంతువులని వేటాడుకుంటూ తిరిగిన సంచార జాతుల వారికి  స్థిర నివాసాలు కల్పించడం జరిగింది కానీ వారు ఇప్పటికీ తమ సంప్రదాయమైన వేట మానలేదు. సాంస్కృతికంగా కూడా దక్షిణ రిపబ్లిక్‌లు వెనుకబడి ఉండేవి. దక్షిణ రిపబ్లిక్‌లు ఆర్థికంగా & సాంస్కృతికంగా వెనుకబడి ఉండడంతో 1990లో సోవియట్ సమాఖ్యని విచ్ఛితి చెయ్యడం సాధ్యమయ్యింది. సోవియట్ సమాఖ్య విచ్ఛిన్నమైనా ఆ సమాఖ్య సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహంలా గర్జించింది అనే విషయాన్ని మర్చిపోలేము.