కేరళ రాష్ట్రానికి టూరిజం నుంచి భారీగా ఆదాయం వస్తోంది. ఆ రాష్ట్రానికి వచ్చే టూరిస్ట్లతో వేశ్యావృత్తి కూడా లాభదాయక వ్యాపారంగా సాగుతోంది. కేరళలో పోలీసులు ఒక వ్యభిచార గృహంపై దాడి చేసి వేశ్యలని అరెస్ట్ చేసి తరువాత ఒక NGO ఆధీనంలోని రెస్క్యూ హోమ్కి తరలించారు. ఆ రెస్క్యూ హోమ్లో కనిష్ఠ సౌకర్యాలు లేవు. అక్కడ కొన్ని రోజులు ఉన్న వేశ్యలు తరువాత పారిపోయి తిరిగి వ్యభిచార గృహానికి వెళ్లిపోయారు. వాళ్లు పారిపోయినా ఆ NGO నిర్వాహకులకి నష్టం లేదు. ఆ NGOలకి తాము విరాళాల రూపంలో సంపాదించిన విదేశీ నిధులతో వేశ్యలకి తిండి పెట్టాల్సిన ఖర్చు మిగులుతుంది. ముంబై, ఢిల్లీ, కోల్కటా లాంటి నగరాలలో ఇంకో రకం NGOలు ఉన్నాయి. వేశ్యలకి కాండొమ్స్ ఇచ్చి వాళ్లని సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడమంటాయి. కానీ వాళ్లని వేశ్యావృత్తి నుంచి బయటకి తీసుకురావడానికి ప్రయత్నించవు. అంతే కాకుండా ఈ సంస్థలు వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తాయి. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే మగవాళ్లకే లాభం. పోలీస్ కేసులకి భయపడకుండా వేశ్యాగృహాలలో దూరొచ్చు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసినంతమాత్రాన వేశ్యలకి ఏదో గౌరవం వస్తుందని అనుకోను. నీతి విషయంలో స్త్రీ-పురుష సమానత్వం లేని సమాజంలో వేశ్యలకి ఏదో గౌరవం ఇస్తారనుకుంటే అది ఇంకా జోకు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి