సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం విజయవాడలో ఉంటే కోస్తా ఆంధ్ర ప్రాంతీయవాదులూ అతని విగ్రహాన్ని ద్వంసం చేసేవాళ్లు. సమైక్యవాద ఉద్యమంలో ఎన్నడూ పని చెయ్యని వీరేశలింగం లాంటి వారి విగ్రహాలని ద్వంసం చెయ్యడం తప్పే. కానీ ప్రాంతీయతత్వం రెండు ప్రాంతాలవాళ్లలోనూ ఉన్నప్పుడు ఎవరిని తప్పుపట్టగలము? పూర్వం భింద్రన్వాలే అనే సిక్కు చాంధసవాది ఉండేవాడు. సిక్కు మతం ప్రకారం జుట్టు కత్తిరించుకోవడం నిషిద్ధం అని హిందువులు కూడా జుట్టు కత్తిరించుకోకూడదు అనేవాడు. హిందువులు కూడా శుద్ధ ఖల్సా సంప్రదాయాలు పాటించాలనేవాడు. తెలంగాణావాళ్లు తాము విడిపోతామంటోంటే బలవంతంగా కలిసి ఉండమనడం ఎలా ఉందంటే హిందువులకి జుట్టు పెంచుకోమని సిక్కులు బలవంతం చేసినట్టు ఉంది. విగ్రహాలు ద్వంసం చేసినవాళ్లు తెలంగాణా తాలిబాన్లైతే మనం ఆంధ్రా భింద్రన్వాలేలము కదా. హిపోక్రిసీ లేకుండా నిజం ఒప్పుకుందాం, మన ప్రాంతంవాళ్లలోనూ ప్రాంతీయతత్వం ఉందని.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి