18, నవంబర్ 2010, గురువారం

పాతా నేతలేండి! కొంగ్రొత్త పార్టీ, రాండి… రాండి!!

పాతా నేతలేండి! కొంగ్రొత్త పార్టీ, రాండి… రాండి!!


దుడ్డుకు ప్రధానంగా రెండు లక్షణాలు.
1. చేతిలో పడగానే తొలుత తనను ఖర్చుచేయమంటూ ఒకటే గోలపెట్టుద్ది.
2. అది పోగుబడిందో ఆధిపత్యం కోరుద్ది.
జగన్మోహన్‌రెడ్డి ఖజానాలో పోగుబడిన లక్ష కోట్ల రూపాయలు రాజశేఖరరెడ్డి మరణాంతరం అదే పోరు ప్రారంభించింది. ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది.
బ్రహ్మవిష్ణురుద్రాదులు అడ్డొచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో రేపో, మాపో కొంగ్రొత్త రాజకీయ ముఠాకి జగన్మోహనరెడ్డి తెరతీస్తాడంతే.
అదే రాహూల్‌గాంధీ మారుమనసు పొందితే తప్ప వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవించి తీరుద్ది. ఆ ముఠా పతాకానికి ముదురు నీలం రంగు పడుద్ది.
కొంగ్రొత్త రాజకీయ ముఠా ఆవిర్భవిస్తే అదెంతమాత్రమూ జగన్మోహనరెడ్డితప్పు కానేకాదు సుమా. ఆ తప్పంతా మనం డబ్బు అనే, కర్నాటకలో దుడ్డు అనే మనీ లక్షణానిది.
కొంగ్రొత్త రాజకీయ ముఠాకు ప్రాణం పోయాలన్న కోరిక ప్రకాశంలోనే పొటమరించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సరిగ్గా జల్‌ తుపాను బలపడుతుందనుకుంటున్న సమయంలోనే పూర్తి స్థాయిలో బలపడింది.
ఇక ముహోర్త0 పెట్టటమే మిగిలి ఉంది.
అది ఎప్పుడన్నది … కాంగ్రెసు పైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తికాదు. అదెందుంటే తెలుగోళ్ల బలహీనత వలనే. అదేందంటారా? ఏమీ లేదండీ. ఎంత తప్పుడోడన్నా కావచ్చు, ఎంతి నికృష్టుడయినా అవచ్చు, అవినీతి చక్రవర్తి అయినా, ప్రజల పీకల్ని పరాపరా కోసిపారేసిన కర్కోటకుడ్నయినా సరే ఇబ్బందులు పెడతన్నారని తెలుగోడికి అన్పించిందా, ఇంకేముందివాడి చుట్టూచేరతారు. వాడికి దండలు వేస్తారు. వాడికి మద్దతు పలుకుతారు. ఆకలయితే తాము మానుకునయినా వాడి నోట్లో కుక్కి కడుపు మంట చల్లారుస్తారు. ఆవలించగానే తాము కింద పడి వాడికి పరుపవుతారు. రాజకీయాల్లో చేరితే ఓట్లు ఒకటేమయిన గుద్దేసి వాడికి గద్దెను ఇచ్చేస్తారు.అది నీదే ఏలుకోమని నిక్కచ్చిగా చెబుతారు. తమని దోచుకోమంటూ దార్లు చూపుతారు. అదీ తెలుగు వాడి. ఆ బలహీనతను ఎవడో బుర్రున్నవాడు జగన్మోహనరెడ్డి చెవిలో వేసేశాడు. చిన్న వైఎస్‌ దాన్ని ఒడిసిపట్టాడు. ఇప్పుడిక అధిష్టానాన్ని రెచ్చగొట్టి, వారిని అపర విశ్రామిత్రులనుచేసి, వాళ్లను పురికొల్పి తననూ తన పరివారాన్నీ కాంగ్రెసు నుంచి గెంటేయించుకునేందుకు ప్రయత్నాల్ని ప్రారంభించాడు చిన్న వైఎస్‌. దానిలో భాగమే నెల్లూరులో వందిమాగధుల మధ్య ఆదివారం నిర్వహించిన ఓదార్పు ముగింపు సభ. ఇప్పటిదాకా ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తోన్న రోజా రొట్టె ఈ సభతో విరిగి నేతిలో పడింది. ముగింపు సభకు ప్రత్యేక ఆహ్వానం ఆమె దక్కించుకుని చెంగున చెంగున నెల్లూరులో వాలి కాంగ్రెసు అధిష్టానికి ఖబడ్దార్‌ చెప్పింది. జగన్‌ అభిమన్యుడు కాదని గొంతెత్తి గోల చేసింది. అర్జునుడని అరిచి మరీ చెప్పింది. అయితే ఇక్కడ అర్జునుడి గురించి ఒకటిరెండు విషయాలు గుర్తుచేసుకుందామా! అర్జునుడికి బోలెడంతమంది భార్యలున్నారు. ఆఖరుకు నల్లమడ అడవుల్లో తిరుగుతూ మన చెంచులోళ్లమ్మాయి చెంచితను కూడా వివాహమాడాడుగదా. చెంచితలాంటోళ్లు ఇంకెంతోమంది అర్జునుడికి. దీనికితోడు అర్జునుడు ఎప్పుడూ ముందు పీఠిన నిలిచిన పాపాన పోలేదు. ధర్మరాజు రాజ్యమేలితే ఆయన వెనక నిలబడ్డాడు. ఇక మిగతా విషయాలన్నింటా కృష్ణుడు తోడులేందే ఒక్కడుగూ వేసినవాడు కాదు. జగన్మోహనరెడ్డి అలాంటివాడనేనా రోజా పోలిక. కొంగ్త్రొత్తపార్టీలో తగు స్థానం దక్కుతుందని పగటి కలలు కంటూ బాలయ్య బాబుని రాజధానిలోనే మూసీనదిలో కలిపేసి, ఓదార్పు ముగింపులో తగుదునమ్మా అంటూ అడుగుపెట్టి మా జగనుబాబు … మా జగనుబాబు అంటూ పిచ్చికూతలు, కారుకూతలు, పిల్లికూతలు కూసిన నందమూరి లక్ష్మీపార్వతికి వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. రామారావు భార్యఅని కొందరికున్న అట్టడుగు సానుభూతి కూడా పోగొట్టుకోవటం తప్ప. అతలసుతలవితల తలాతల, పాతాళ లోకానికి లచ్చుమమ్మ అతితెలివి చేరిపోయిందంతే.
ఇక ఇప్పటికే చిన్న వైఎస్‌ కంపు గుంపులో చేరిపోయిన అవినీతిపరులు, అక్రమార్కులు ఆయన్ని దినందినం, క్షణం, క్షణం అహో, ఒహో అంటూ రెచ్చగొట్టి వదిలేశారు. రెచ్చిపోయిన వైఎస్‌, చెలరేగిన వైఎస్‌ ఇక ఊరుకుంటాడా? చకచకా ఓదార్పు చేసేస్తూ, గబగబా ఎక్కడోకక్కడ కాంగ్రెసు పార్టీకి నిట్టనిలువుగా బొక్కకొడతాడు. కొంగ్రొత్తపార్టీకి అడ్డంగా ఉన్న పలుచటి తెరను చించేస్తాడు. అదీ సంగతి. ఇదంతా ఇప్పటికిప్పుడే కాదు. తెలుగు యవనికమీద అప్పుడు కొంత అప్పుడు  కొంత తిలకించాల్సిన తిక్క సినిమా