1, మే 2011, ఆదివారం

ఇప్పుడు రాజశేకర్ పయనమెటు?


Shekar
జీవిత రాజశేకర్ దంపతులు ఎప్పుడు ఎవర్ని పొగుడుతారో, ఎప్పుడు ఎవర్ని తెగుడుతారో ఎవరికీ తెలియదు. మొన్నటిదాకా చిరంజీవిని తిడుతూ వచ్చిన ఈ జంట ఈరోజు జగన్ మీద పడింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే జగన్ పార్టీకి ఈరోజు వీరు గుడ్ బై చెప్పేశారు. ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక లక్ష్యంతోనే జగన్ ఉన్నారనీ, గతంలో ఆయన సభలో అభిమానుల నుంచి తమకు వచ్చిన ఆదరణ చూసి, తట్టుకోలేక తమని నిర్లక్ష్యం చేశారనీ వీరు చెప్పుకొచ్చారు.
వాస్తవానికి, తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటూ, తమకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వీరిద్దరూ కోరుకుంటూవుంటారు. అయితే, జగన్ పార్టీలో ఇప్పటికే రోజా లాంటి సినీతారలు ఉండడంతో వీరికి అక్కడ తగిన గుర్తింపు లభించలేదు. దాంతో వీరు అక్కడ ఇమడలేక బయటకు వచ్చేయాలని నిర్ణయించుకుని, ఈరోజు ఆ పని కాస్తా ఇలా జగన్ మీద ఎటాక్ చేసి, కానిచ్చేశారు. ఇప్పుడీ జంట కాంగ్రెస్ లోకి తిరిగి ఎలాగూ వెళ్ళలేదు. ఎందుకంటే, అక్కడ తమ బద్ధశత్రువు చిరంజీవి వుండనే వున్నాడు. ఇక వీరికి మిగిలింది టీడీపీ ఒక్కటే! అది కూడా మహామహుల సంగమం. అక్కడా సినిమా వాళ్ళు వుండనే వున్నారు. మరి, అక్కడ మాత్రం ఈ జంట ఇమడగలదా?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి